మన్యం టీవి,న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.514 పెరిగి రూ.48,847కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ముగియడం, రూపాయి మారకం విలువ కొంచెం తగ్గడం దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. క్రితం ట్రేడింగ్ 10 గ్రాముల బరువున్న 24 క్యారట్ బంగారం ధర రూ.48,333 వద్ద ముగిసింది.
ఇక, వెండి ధరలు కూడా ఢిల్లీలో పెరిగాయి. మంగళవారం నాటి ట్రేడింగ్లో కిలో వెండి ధర రూ.1,046 పెరిగి రూ.63,612కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర 62,566 వద్ద ముగిసింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,845 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.16 అమెరికన్ డాలర్లు పలికింది.
Post A Comment: