మన్యం టీవీ మంగపేట.
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రుణాలు పొందేందుకు 2020-21 ఏడాదికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ శాఖ కార్యనిర్వహణాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం ఉపాధి యూనిట్లను ఏర్పాటు చేసుకునే ఆసక్తి ఉన్నవారు ఈనెల 24 వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలు నగర పాలకసంస్థ పరిధిలోని ఎస్సీలు వ్యవసాయేతర పథకాలకు (2020 జులై 1వ తేదీ నాటికి వయస్సు 21 నుంచి 50 సంవత్సరాలలోపు), వ్యవసాయ ఆధారిత పథ కాలకు (21 నుంచి 60 ఏళ్ల వరకు) అర్హులని తెలిపారు. (గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు వార్షిక ఆదాయం రూ.1.50 లక్షల లోపు, పట్టణ ప్రాంతం, నగరపాలిక, మున్సిపాలిటీలకు చెందిన వారికి రూ.2 లక్షలలోపు ఆదాయం ఉండాలన్నారు.
ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసు కోవాలని సూచించారు.
Post A Comment: