CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లో సుమారు రూ.7 కోట్ల 56 లక్షల రూపాయల నిధులతో సమితి సింగారం,అశోక్ నగర్,కట్టు మల్లారం వద్ద గల కోడిపుంజుల వాగుపై నిర్మాణ చెయ్యనున్న చెక్ డ్యామ్ ల పనులకు ఆదివారం విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు శంకుస్థాపన చేసారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం వృధాగా పోతున్న వాగులు, వంకలు పై,చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని పినపాక నియోజకవర్గ అభివృద్ధి లో వ్యవసాయం ప్రధానంగా ఉన్నది అని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లాము అని వెంటనే స్పందించి సంబందిత ఇరిగేషన్ అధికారులు పినపాక ఇరిగేషన్ ప్రొఫైల్ తయారు చేయవలసింది గా ఆదేశించారు అని చెక్ డ్యామ్ లకు నిధులు మంజూరు చేశారు అని తెలిపారు.ఈ సందర్భంగా మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు  కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.చెక్ డ్యామ్ ల వలన నీటిని నిల్వ చేసు కోవడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని నిరంతరం రైతుల శ్రేయస్సు గురించి ఆలోచించే ఏకైక ప్రభుత్వమని అన్నారు. రైతుల కోసం,రైతు రుణమాఫీ, రైతుబంధు,24 గంటల కరెంట్,పేద ప్రజలకు,అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల  ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పలు శాఖల ప్రభుత్వ అధికారులు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: