మన్యం టివి, అశ్వాపురం:అశ్వాపురం మండల ఎంపీటీసీ ల సంఘం మండల అధ్యక్షుడుగా మొండి కుంట ఎంపీటీసీ కమటం నరేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల కేంద్రంలో జరిగిన ఎంపీటీసీ ల సమావేశంలో నరేష్ ను ఎంపీటీసీ ల సంఘం అధ్యక్షుడు గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ తనను అధ్యక్షుడుగా ఎన్నుకున్న ఎంపీటీసీ లకు, ఎంపీపీ సుజాత కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఎంపీటీసీ ల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం ద్వారా ఎంపీటీసీ లకు ప్రత్యేక నిధులు మంజూరు కోసం జిల్లా, రాష్ట్ర కమిటీ ద్వారా కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో ఎంపిపి ముత్తినేని సుజాత, ఎంపీటీసీ లు పాల్గొన్నారు.
Post A Comment: