-అభినందించిన హెడ్మాస్టర్ హనుమ
పినపాక
కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఇన్స్పైర్ మనక్ ప్రదర్శనలో పాల్గొనేందుకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుగినె పల్లి నుండి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు పి అహల్య , పీ రేష్మ ఎంపికయ్యారు. 2020- 21 సంవత్సరానికి వీరు ఎంపికైనట్లు గా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బీ హనుమ తెలియజేశారు. గతంలో ఇదే పాఠశాల నుండి ఏడవ జాతీయ స్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలో గౌతమి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచినది మున్ముందు జరిగే పోటీలలో విద్యార్థులు ప్రతిభ కనబరచాలని బి హనుమ ఉపాధ్యాయ బృందం హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: