గుండాల మన్యం టీవీ: ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు. మంగళవారం గుండాల మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట తుడుoదెబ్బ ఆధ్వర్యంలో రిలే' నిరాహార దీక్షలను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఏజెన్సీ లో ఎల్టీఆర్, 1/70చట్టానికి విరుద్దంగా గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకున్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనీ కోరారు.
భూమిలేని ఆదివాసీలకు 5ఎకరాలు ప్రబుత్వ భూమి ఇవ్వాలనీ, ఏజెన్సీ లో ఇల్లు లేని నిరుపేద ఆదివాసీలకు ఇంటి స్థలం, డబుల్ బేడ్ రూమ్ ఇండ్లు కట్టి ఇవ్వాలనీ తెలిపారు.
గిరిజనేతరూలకు సాదాబైనామా పేరుతో ఇచ్చినా పట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుoదెబ్బ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి గుప్పిoడి వెంకటేశ్వర్లు , జిల్లా ఉపాధక్షులు పూనేo శ్రీను , జిల్లా కార్యదర్శి వజ్జ ఎర్రయ్య , గుండాల మండల అద్యక్షులు మోకాళ్ళ కన్నయ్య , ప్రదానకార్యదర్శి గోవింద నరసింహరావు , కల్తీ మల్లయ్య , అరెo విజయకూమార్, పర్షిక బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: