మన్యం టీవి, పినపాక:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని ఏడుళ్ల బయ్యారం గ్రామంలోని సాయిబాబా ఆలయంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన పడిపూజ కార్యక్రమం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పాల్గోన్నారు. ఈ సందర్భంగా స్వాములు విప్ రేగా కాంతారావు ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ...అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పినపాక ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, రైతు సమన్వయ సంఘం మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు కొండేరు నాగభూషణం సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము నాయకులు దాట్ల వాసు బాబు,పోలి శెట్టి సత్తిబాబు స్వామి తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: