మన్యం టీవి,హైదరాబాద్:
ఈ నెల 7.12.2020 న పురపాలక మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మం పర్యటన ఖరారు అయినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు. ప్రారంభోత్సవాల వివరాలు వరుస క్రమంలో..
1. ఖనాపురం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
2. బల్లెపల్లి అధునాతన వైకుంఠ ధామం ప్రారంభోత్సవం.
3. పండు రంగా పురం-కోయచలక క్రాస్ బిటి రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ డివైడర్, లైటింగ్ లైటింగ్ ప్రారంభోత్సవం(కోయచలక సర్కిల్ వద్ద).
4. రఘునాధపాలెం- చింతగుర్తి బిటి రోడ్డు వెడల్పు ప్రారంభోత్సవం మరియు రఘునాధపాలెం మినీ ట్యాంక్ బండ్ ప్రారంభోత్సవం.
5.ఎన్ ఎస్ పి కెనాల్ వాక్ ట్రాక్ ప్రారంభోత్సవం.
6. కేఎంసీ పార్క్(పట్టణ ప్రకృతి వనం, 22వ డివిజన్) ప్రారంభోత్సవం.
7. లకారం ట్యాంక్ బండ్ సర్కిల్లో పీవీ నర్సింహారావు గారి విగ్రహం ఆవిష్కరణ.
8. దంసలాపురం ఆరోబి ప్రారంభోత్సవం. అక్కడే ప్రో. జయశంకర్ సార్ విగ్రహం, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ డివైడర్ ఆవిష్కరణ.
9. పోలీస్ కమిషనరేట్ నూతన భవనం ప్రారంభోత్సవం- ప్రకాష్ నగర్.
10. గోళ్లపాడు ఛానల్ ఆధునీకరణ(ఓపెన్ జిమ్, పార్క్) ప్రారంభోత్సవం- సుందరయ్య నగర్, ఖమ్మం.
11. ఐటీ హబ్ ప్రారంభోత్సవం(ఇల్లందు సర్కిల్). అనంతరం సభ.
Post A Comment: