మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈరోజు ములుగు కేంద్రలో
తెలంగాణ జాగృతి ములుగు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పోరిక రవీందర్ ఆధ్వర్యంలో ప్రవేటు టీచర్స్ కి సుమారు (20)మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. లాక్ డౌన్ నుండి ఇప్పటివరకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రవేటు టీచర్స్ కి ఉడుతా భక్తి సహాయంగా తెలంగాణ జాగృతి ములుగు జిల్లా స్పందించి
సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి యువజన సంఘం అధ్యక్షులు మోడెం శివ శంకర్ గౌడ్, మీడియా ఇంచార్జ్ నాజర్ ఖాన్ ,మహిళా నాయకురాలు శ్రీమతి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: