మన్యం టివి:కరకగూడెం.కరకగూడెం మండలంలోని కల్వాలనగరం,సమాత్ భట్టుపల్లి,తాటిగూడెం మరియు మెతె గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కరకగూడెం మండల ఎంపీపీ రేగా కాళిక చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది.అనంతరం రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ...రైతులు పండించిన ప్రతి గింజను గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ కొమరం కాంతారావు,మండల అభివృద్ధి ఆధికారి డి శ్రీను,పినపాక సొసైటీ ఛైర్మన్ రవి వర్మ,రైతు సమన్వయ అధ్యక్షులు వట్టం వెంకటేశ్వర్లు,కరకగూడెం సర్పంచ్ ఊకే రామనాథ,వ్యవసాయ మార్కెట్ కమిటి ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు,కరకగూడెం,సొసైటీ డైరక్టర్లు రావుల కనకయ్య,టిఆర్ఎస్ పార్టీ నాయకులు,రైతులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: