హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సరళి టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. అయితే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ ఎన్నికల కౌంటింగ్లో పత్తా లేకుండా పోతోంది. ముఖ్యంగా టిపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించిన లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆయన బాధ్యత తీసుకున్న లచ్చపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 163 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి ఆ గ్రామంలో 520 ఓట్లు పోలవగా, బీజేపీకి 490 ఓట్లు పోల్ అయ్యాయి. టీపీసీసీ చీఫ్గా ఈ పరిణామం ఆయనకు కాస్త ఇబ్బందికరమే అని చెప్పాలి.
..
Post A Comment: