మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం హైదరాబాదు లోని వెంకటాద్రి టౌన్షిప్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ను వారి నివాసం లో మర్యాద పూర్వకంగా కలిసి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మణుగూరు టిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు తాళ్లపల్లి యాదగిరి గౌడ్,ముద్దంగుల కృష్ణ,పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పద్దం శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: