CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నదాతలు అప్రమత్తంగా ఉండాలి -ఎంపీపీ గుమ్మడి గాంధీ

Share it:



మన్యం టీవి, పినపాక:

నివర్‌ తుఫాన్‌ కారణంగా మండల వ్యాప్తంగా వర్షం ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అన్నదాతలు అప్రమత్తంగా వ్యవహరించాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.ప్రస్తుతం మండలం లో వరిపంటకు సంబంధించి పంటకోత, ధాన్యం కేంద్రాలకు రవాణా జరుగుతున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. తుఫాన్‌ ప్రభావం పూర్తిగా పోయేంతవరకు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకురావద్దని పేర్కొన్నారు. ఇప్పటికే పంటకోత చేపట్టిన రైతులు పంట భద్రతపై తగు చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. సురక్షితమైన ప్రదేశాల్లో పంటను నిల్వచేసుకోవాలని  వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితులలో పంటను కూలీలతో కోత చేయటం శ్రేయస్కరం కాదన్నారు. కూలీలలతో పంటను కోసినైట్లెతే మెదళ్లు తడవడం ద్వారా ధాన్యం మొలకెత్తే అవకాశం ఉంటుందన్నారు. తద్వార పంట నాణ్యత కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: