మన్యం టీవి, కరకగూడెం: కరక గూడెం పోలీస్ స్టేషన్ ను మణుగూరు ఏఎస్పీ Dr శబరిష్, ఐ.పి.స్ సందర్శించారు.తొలుత ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం పెండింగ్ కేసులు లేకుండా పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారి పట్ల బాధ్యత గా వ్యవహరించి సమస్యను త్వరితగతిన పరిష్కరించేలా విధులు నిర్వహించాలని ఆయన పోలీసులకు సూచించారు. ఏజెన్సీలో మావోల అలజడి ఉండటంతో మమ్మురంగా తనిఖీలు నిర్వహించి అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను ఆయన పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కరక గూడెం ఎస్ఐ జి.ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: