మన్యం టీవి,హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక ఓటమికి బాధ్యత వహిస్తున్నాని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేసిన దుబ్బాక ప్రజలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్ట పడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు. దుబ్బాక ఓటమికి గల కారణాలు పూర్తి స్థాయిలో సమీక్షించుకుంటామన్నారు. మా లోపాలను సవరించుకుంటాం. దుబ్బాక ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ నిరంతరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.
Navigation
Post A Comment: