CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శివసేన లోకి రంగీలా ఊర్మిళ

Share it:



ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు ఊర్మిళా మంటోడ్కర్‌ సోమవారం శివసేన పార్టీలో చేరనున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నార్త్ ముంబై స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ సీనియర్ నేత గోపాల్ చినయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 మార్చిలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ఊర్మిళా అదే ఏడాది సెప్టెంబర్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్‌లోని రాజకీయాల కారణంగానే తాను పార్టీకి దూరం అవుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌లో పెద్ద లక్ష్యం కోసం పనిచేయడానికి బదులు అంతర్గత రాజకీయాలు, పార్టీలోని స్వార్థ ప్రయోజనాలతో పోరాటం చేయడం చాలా కష్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై కాంగ్రెస్ చీఫ్ మిలింద్ దేవరాతో తాను పంచుకున్న విశ్వసనీయ సమాచారం కూడా బహిర్గతం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబైలో తన ఓటమికి పార్టీలోని కొన్ని వర్గాలు పనిచేశాయని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌పై తనకు భ్రమలు తొలగిపోయాయని ఈ రంగీలా భామ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచనలంగా నిలిచింది. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా వస్తున్న ఈ బాలీవుడ్ నటి సోమవారం నుంచి కొత్తగా తన రాజకీయ ప్రయాణం ప్రారంభించబోతున్నారు.

Share it:

NATIONAL

Post A Comment: