మన్యం టీవీ ఏటూరునాగారం:
తాడ్వాయి మండలంలోని జలగలంజా, మొండాల తోగు, కొండపర్తి గొతికోయ ఆదివాసి గిరిజన గూడెలలో గురువారం ఉమ్మడి జిల్లాల ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ సాధుల ప్రసాద్ రగ్గులు, బ్లాంకెట్ లు, చెద్దర్ లు, చిన్న పిల్లలకు షట్టర్లను, మరియు పండ్ల ను ఆయన స్వంత ఖర్చుల తో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాధువుల ప్రసాద్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు చలిలో చాలా ఇబ్బందులు పడుతున్నారని ఉద్దేశంతో తమ సొంత ఖర్చులతో పంపిణీ చేసినట్లు తెలిపారు. పిల్లలకు మంచి చదువు చదివించాలని, వారి తల్లిదండ్రులకు సూచించారు. కరోనా వ్యాధి సెకండ్ వేవ్ ప్రమాదకరంగా ఉంటుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా, ఈయన తాడ్వాయి మండల ఇంచార్జీ ఎంపీడీవో గా కూడా ఉన్నపుడు ఎర్రటెండలో వందరోజుల పనిచేసే కూలీలకు పండ్లు, మజ్జిగ పాకెట్లను పంపిణీ చేశారు. చాల ఉదార స్వభావం గల ఉద్యోగ నాయకునిగా మండలంలో మంచి పేరు తెచ్చుకొని, అందరి గ్రామస్థుల మన్ననలను పొందినారు.
Post A Comment: