గుండాల మన్యం టీవీ: నూతన ఓటరు నమోదుపై ఆళ్లపల్లి తాసిల్దార్ అంజద్ పాష ఆధ్వర్యంలో శనివారం ఆళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2021 సంవత్సరానికి గాను 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరణించిన వారిని ఓటరు జాబితా నుండి తొలగించడం జరిగిందన్నారు. అభ్యంతరాలు ఉంటే ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు తమ దృష్టికి తీసుకురావాలన్నారు. డిసెంబర్ 5 నుండి గ్రామపంచాయతీలో అవగాహన కార్యక్రమాలు, ఓటరు నమోదు ప్రక్రియ చేపడతామని తెలిపారు. 18 సంవత్సరాల నిండి ఓటరు జాబితాలో లేనివారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.
Navigation
Post A Comment: