CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చుంచుపల్లి గ్రామ సభ రసాభాస వాయిదా పడ్డ గ్రామ సభ

Share it:


మన్యం టీవీ మంగపేట.

 

మంగపేట మండలంలోని,  చుంచుపల్లి ఇసుక క్వారీ ఏర్పాటు చేయుటకు మండల అధికారులు తహసీల్దార్ బాబ్జి ప్రసాద్ మరియు ఇతర అధికారులు ఆధ్వర్యంలో,  జరిగిన   గ్రామ సభ రసాభాసగా  మారింది . వివరాల్లోకి వెళితే ఇసుక క్వారి పెట్టాలంటే గ్రామ సభ అనుమతి కావాలని చుంచుపల్లి గ్రామ సభ పెట్టడం జరిగింది కానీ, ఆ గ్రామ సభలో తీసుకున్న నిర్ణయాలు భారత రాజ్యాంగం లోని 5 ఆర్టికల్ ప్రకారం విరుద్ధం,   73 వ రాజ్యాంగ సవరణ ప్రకారం దిలీప్ సింగ్ భూరియా కమిటీ సూచించిన డిసెంబర్ 24/1996 పెసా చట్టం ప్రకారం గ్రామ సభ సభ్యుల్లో 1/5 వంతు మంది కోరం గా నిర్ణయం చేసారు. లేదా హాజరైన వారిలో 1/3 వంతు మంది గిరిజన, దళిత, మహిళ మొదలగు వర్గాలుండాలి అలా లేకుండా తీసుకున్న నిర్ణయాలు చెల్లనేరవని చుంచుపల్లి గ్రామ గిరిజనులు అధికారులను నిలదీశారు. గ్రామ సభ అంటే కేంద్రంలో పార్లమెంట్, రాష్ట్రంలో అసెంబ్లీ లో చట్టాలకు ఎంత విలువ ఉంటుందో, అదే విలువ, అదే రీతిలో ఇక్కడ చట్టాలు చేయాలనీ ముఖ్యంగా షెడ్యూల్డ్ ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకునే నిర్ణయాల్లో షెడ్యూల్డ్ తెగల మెజారిటీ నిర్ణయాలు మాత్రమే చెల్లుబాటు jఅవుతాయని, చదువుకొన్న అధికారులు మీకు కూడా తెలియక పోతే ఎట్లా  మీ భాద్యతలు మీరే  మర్చిపోతే ఎట్లా అని గిరిజన నాయకులు మండిపడ్డారు. తదనంతరం తహసీల్దార్ బాబ్జి ప్రసాద్,  చుంచుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి గ్రామ సభను వాయిదా వేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: