CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దీపావళి బాణాసంచా అమ్మకాలకు రెండు గంటలు అనుమతి

Share it:


మన్యం టీవీ మంగపేట. 

ఆఖరినిమిషంలో సుప్రీంకోర్ట్  ఆదేశాలు

మన్యం టీవీ మంగపేట. 


తెలంగాణ రాష్ట్రంలో బాణసంచాను నిషేధిస్తూ నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం సాయంత్రం కీలక ఆదేశాలు జారీచేసింది.క్రాకర్స్ టపాసుల నిషేధంపై సుప్రీంకోర్టు శుక్రవారం కొన్ని సవరణలతో ప్రజలకు మధ్యంతర ఓదార్పు ఉత్తర్వులు జారీచేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ గ్రీన్‌ క్రాకర్స్‌కు అనుమతినిచ్చింది. ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దీపావళి రోజు 2 గంటలపాటు టపాసులు కాల్చుకునేందుకు అవకాశం కల్పించింది.  రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది.  సుప్రీంకోర్టు తీర్పుతో బాణసంచా వ్యాపారులకు ఊరట లభించింది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో క్రాకర్స్‌ను నిషేధిస్తూ హైకోర్టు తీర్పును వెలువరించిన విషయ తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వ్యాపారులు సుప్రీంకోర్టులో  శుక్రవారం లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రెండు గంటల పాటు గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు అనుమతినిచ్చింది.దీంతో రాష్ట్ర, జిల్లా, ఏజన్సీఏరియా వ్యాప్తంగా దీపావళి పండుగ వాతావరణం నెలకొని ,అన్ని  వర్గాల్లో సంతోషాల హరివిల్లు లు వెల్లివిరుస్తున్నాయి.

Share it:

TECHNOLOGY

Post A Comment: