వలస ఆదివాసీ యువకుని ఆర్థిక సహాయం
*ఇదివరకే విప్ రేగా చొరవతో కాలు తొలగింపు
*ఆర్ధిక వితరణ తో మానవత్వాన్ని చాటిన గోపాలారావుపేటయువత
మన్యం టీవి, పినపాక:పినపాక మండలం
తోగ్గూడెం పంచాయతీ టేకులగూడెం గ్రామానికి చెందిన దీర్ఘ సోమయ్య s/o వీరయ్య కు గత కొన్ని రోజుల క్రితం రక్త పింజర కాటువేయడంతో కాలు మచ్చలుగా ఏర్పడి క్రమంగా కాలు కుళ్ళి పోవడంతో విప్ రేగా కాంతారావు చొరవతో వైద్యులు ఆ బాలుడి కాలు తొలగించడం జరిగింది. దీన స్థితిలో ఉన్న దీర్ఘ వీరయ్య కుటుంబానికి అండగా మేము సైతం అంటూ గోపాలరావుపేట యువత తమ వంతు సహాయంగా ఆ కుటుంబానికి 5000రూపాయలు, 50kg బియ్యాన్ని ఆర్ధిక సహాయంగా ఇవ్వడం జరిగింది. దాతల వివరాలు ఇలా ఉన్నాయి. డీలర్ ఆదినారాయణ రూ 2వేల విలువైన 50కే జీ ల బియ్యం, కొంపెళ్లి శ్రీనురూ.500,అనిపెద్ది వినోద్ కుమార్ రూ.567,కెపా సతీష్ రూ. 500,కాయిత నరేష్ రూ.500,వంగ నిరంజన్ రెడ్డి రూ.500,కోపెళ్లి సంతోష్ రూ.300,ఇళ్ళ నవీన్ రూ. 300,గాడుదుల దిలీప్ రూ.300,జలగం లింగయ్య రూ.300,కొత్త దామోదర్ గౌడ్ రూ. 200,కన్నె రమేష్ రూ.200,గంగర బోయిన రామకృష్ణ రూ.200అనిపెద్ది రాజేష్ రూ. 200,ముప్పారపు సృజన్ రూ.200,రేసు కోటేశ్వరరావు రూ. 200 తదితరులు మొత్తం రూ 5వేల రూపాయలు సేకరించి బాధిత కుటుంబానికి అందజేసి ఉదార చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో కన్నె రమేష్, కొంపెల్లి సంతోష్, రేసు కోటేష్ మరియు యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: