జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు ఆదివారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. గోషామహాల్, సనత్నగర్, సికింద్రబాద్ నియోజకవర్గాల్లో రోడ్డు షోల్లో పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు గోషామహాల్ నియోజకవర్గంలోని జుమేరాత్ బజార్లో, 3 గంటలకు సనత్ నగర్ నియోజకవర్గంలోని పాటిగడ్డ చౌరస్తాలో, 4 గంటలకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని శాంతినగర్ కాలనీ చౌరస్తాలో కేటీఆర్ రోడ్డు షోలు కొనసాగనున్నాయి. శనివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ విజయవంతమైంది. సభకు అశేష జనం తరలివచ్చి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించారు.
Navigation
Post A Comment: