మన్యం టీవీ మంగపేట.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ఎర్రం గారి విరన్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. రహదారి పై విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టపాసులు కలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా నాయకుడు తాటి కృష్ణ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ మాట్లాడుతూ దుబ్బాక విజయం ఆరంభం మాత్రమే అని రాబోవు రోజుల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని నేడు జరిగిన దేశంలో అన్ని ఎన్నికలలో బీజేపీ విజయం సాధించిందని కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో, రాష్ట్రంలో బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ విజయ దుందుభి మోగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు విరన్ కుమార్,జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్ధన్,జబ్బ సమ్మయ్య,పొందేం రవీందర్, యూత్ నాయకులు అనిల్ కుమార్,జవంగుల రవీందర్ దితరులు పాల్గొన్నారు.
Post A Comment: