ఆపద అంటే అన్నితానయి ఆదుకుంటున్న బూర్గంపహాడ్ జెడ్పిటిసీ కామిరెడ్డి శ్రీలత దంపతుల
జెడ్పిటిసీ దంపతులకు జీవితాంతం ఋణపడి ఉంటామన్నా కావ్య తల్లితండ్రులు
మన్యం టీవీ, బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలో ఇటీవల అనారోగ్యానికి గురై మెరుగైన వైద్యం నిమిత్తం హైదరాబాదులో నిమ్స్ హాస్పిటల్ చేరిన తర్వాత సరైన చికిత్స అందుబాటులో లేకపోవడం వల్ల బూర్గంపాడు మండలం జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత గారిని ఆశ్రయించగా , తనకు ఉన్న రాజకీయ సంబంధాలను ఉపయోగించి ఇమ్మడి కావ్యకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా చూసి పూర్తి ఆరోగ్యంగా బయటకు వచ్చే వరకు ప్రతిరోజు యోగక్షేమాలు కనుక్కుంటూ చికిత్సకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు. ఈరోజు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వచ్చిన వచ్చిన కావ్య ను బూర్గంపాడు మండల కేంద్రంలోని ముదిరాజ్ బజార్ తన నివాసానికి వెళ్లి పరామర్శించింన బూర్గంపహాడ్ జెడ్పిటిసీ కామిరెడ్డి శ్రీలత, రామ కొండారెడ్డి దంపతులు.తనకూతురు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి రావడానికి కారకులైన జెడ్పిటిసీ కామిరెడ్డి శ్రీలత దంపతులకు జీవితాంతం ఋణపడి ఉంటామన్న కావ్య తల్లితండ్రులు. ఎటువంటి వైద్య సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చిన జెడ్పిటిసీ దంపతులు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గోనెల నాని, వార్డ్ మెంబర్ తోకల సుమతి, తోకల సతీష్, గంగరాజు, బాల యాదవ్, ఆకుల లక్ష్మీ నారాయణ రెడ్డి, సతీష్, సారంగ శివ అన్సర్, చిన్న బుజ్జి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: