మన్యంటివి,అశ్వారావుపేట: తెలంగాణ విప్ పినపాక ఏంఎల్ఏ రే
గా కాంతరావు స్థాపించిన మన్యం మనుగడ మాసపత్రికను మల్లాయిగూడెం సర్పంచ్, జిల్లా దిశ కమిటీ సభ్యులు, అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నారం రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో సర్పంచులు బృందం ఆవిష్కరిండం జరిగింది. ఈ సందర్బంగా సర్పంచ్ రాజశేఖర్ మాట్లాడుతూ అక్టోబర్ సంచిక లో సంస్కృతి సంప్రదాయాలు చక్కగా వివరించారు అని నవంబర్ పత్రికను తనతో కొంత మంది సర్పంచులు తీసుకోవడం జరిగింది అని తెలిపారు. పత్రిక అందించిన అశ్వారావుపేట మన్యం టివి ప్రతినిది దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో నారాయణపురం సర్పంచ్ కంగాల పరమేష్, అనంతారం సర్పంచ్ పాయం చిన్న కామయ్య, కోయ రంగాపురం సర్పంచ్ కంగాల గోవింద్, బచ్చువారిగూడెం సర్పంచ్ కుంజా భవాని, గుమ్మడివల్లి సర్పంచ్ కోడిమి సీత తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: