వెంకటాపురం (నూగూరు)
ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో వెంకటాపురం ఎంపీడీవో కి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది .అనంతరం మండల ఉపాధ్యక్షుడు పాయం కృష్ణ ప్రధాన కార్యదర్శి పూనేం ప్రతాప్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం లో స్థానిక ఆదివాసులకు అనుమతులు ఇవ్వాలని (వ్యాపార నిమిత్తం) గిరిజనేతరులు వ్యాపారరీత్యా గ్రామపంచాయతీ అనుమతులు తీసుకొని పంచాయతీ సూచించిన స్థలాలను 50 వేల రూపాయల నుండి రెండు లక్షల వరకు అమ్ముకుంటున్నారని ఆమెకు వివరించారు.ఆర్టీసీ కాంప్లెక్స్ లోని బినామీ పేర్లతో గిరిజనేతరులు వ్యాపారం చేసుకుంటున్నారని కి దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని అర్హులైన ఆదివాసీలకు జీవన ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీలో వ్యాపార నిమిత్తం ప్రభుత్వ భూముల్లో గ్రామపంచాయతీ చూపించిన నా స్థలాలను ఆసరగా తీసుకుని రెంటు కు అమ్ముకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా గిరిజనేతరులకు వారి ఆలోచన విధానానికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రేగ గణేష్,పూనేం చంటి మండల నాయకులు అనిల్,రాంబాబు,నాగరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: