గుండాల మన్యం టీవీ: పేదింటి ఆడపడుచుల అండగ కల్యాణ లక్ష్మి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆళ్ల పల్లి ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి, జెడ్పిటిసీ కొమరం హనుమంతరావు అన్నారు. మంగళవారం ఆల్లపల్లి మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి తాసిల్దార్ అంజద్ పాష, కోపరేటివ్ చైర్మన్ జీ రామయ్య, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాయ నర్సింహరావు, కోపరేటివ్ డైరెక్టర్ ఎండీ ఆఫీజ్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: