మన్యంటివి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట అర్బన్ కాలనీ లో నాగుల మీర కుమార్తె గత 4 సంవత్సరాల నుండి వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నది. ఆ చిన్నారి మెరుగైన వైద్యం కోసం అశ్వారావుపేట తెరాస నియోజక వర్గ నాయుకులు జారే ఆదినారాయణి అభ్యర్థించగా, జారే ఆదినారాయణ హైదరాబాదులోని నిమ్స్ హాస్పిటల్ కి వెళ్ళమని సూచించారు. అలాగే శస్త్ర చికిత్స నిమిత్తం, అవసరమైతే ఎంపీ నామ నాగేశ్వరరావు ద్వారా, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ ఓ సి ఇప్పించడానికి సహాయపడతానని హామీ ఇస్తూ, వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు, మండల ఉపాధ్యక్షులు ఏసుబాబు, టీఆర్ఎస్ పార్టీ మండల యువజన నాయకుడు మడకం రాజేష్ మరియు ఎస్ కే వలీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: