మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిధిలోని జమ్మి గూడెం సర్పంచ్ మిద్దిన రామలక్ష్మి (36) అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో శనివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు సడన్గా గుండెలో నొప్పి వచ్చి ఇబ్బంది పడుతూ ఉండగా భర్త కొండయ్య హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపధ్యంలో ఆమె మృతి చెందారు. ఆమె భౌతికకాయం స్వగ్రామం జమ్మి గూడెం రాత్రి 9 గంటలకు తీసుకొని రాగా గ్రామ ప్రజలంతా కన్నీరుమున్నీరయ్యారు. భర్త కొండయ్య అదే గ్రామానికి మాజీ సర్పంచ్, వీరికి ఇద్దరూ బాల్యదశ అబ్బాయిలు ఉన్నారు.
Navigation
Post A Comment: