మన్యం టీవి, పినపాక: ప్రతి ఇంటి లోగిలి దీప కాంతులతో వెలగాలని, అన్నదాతల కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని విప్ రేగా కాంతారావు ఆకాంక్షించారు. అజ్ఞాన అంధకారాలను తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి తీసుకురావాలని కోరుకున్నారు.ప్రజలందరికి విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు దీపావళి పండుగను ఎన్నో జాగ్రత్తల మధ్య జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రస్తుతం మనం కోవిడ్ మహమ్మారి తో పోరాటం చేస్తున్నాం. ఈ ప్రమాదకర వైరస్కు మెడిసిన్ కానీ వ్యాక్సిన్ కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కాబట్టి పండుగ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా షాపింగ్ చేస్తే..వైరస్ విజృంభించే ప్రమాదం ఉంది.కాబట్టి ఈ మహమ్మారిని అజాగ్రత్తగా తీసుకోకుండా, అనునిత్యం జాగ్రత్తగా ముందుకు సాగాలి అని విప్ రేగా ప్రజలకు సూచించారు.భౌతిక దూరం,మాస్క్ తప్పనిసరి ధరించాలి అని ఆయన సూచించారు.
Navigation
Post A Comment: