మన్యం టీవీ కొత్తగూడెం నవంబర్ 12
ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో పాల్వంచ సీఐ మరియు ఎస్సై తమ సిబ్బందితో కలిసి దమ్మపేట సెంటర్ నందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ప్రయాణిస్తూ కనిపించిన వారిని ఆపుతుండగా,పారిపోవడానికి ప్రయత్నం చేసిన వారిని అదుపులోకి తీసుకొని విచారించగా
1) చీకట్ల సతీష్ @ పాను,28yrs,కార్ డ్రైవర్,R/o.పాతకొండగూడెం గ్రామం, కామవరపుకోట మండలం,పచ్ఛిమ గోదావరి జిల్లా. 2009వ సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇతనిపై 23 కేసులు నమోదై ఉన్నట్లు విచారణలో తేలింది.
2) వీపు వెంకటేశ్వర్లు,26yrs,కూలి,R/o.సుబ్బంపేట కాలనీ,జంగారెడ్డిగూడెం మండలం,పచ్ఛిమగోదావరి జిల్లా. ఇతను 2013 వ సంవత్సరం నుండి దొంగతనాలు చేయడానికి అలవాటుపడి ఇప్పటికి 02 కేసులలో ఉన్నట్లు విచారణలో తేలింది.
03) షేక్ బాషా,25yrs,వెల్డింగ్ వర్కర్,R/O.బుట్టాయిగూడెం రోడ్,పద్మ థియేటర్ ఎదురుగా,జంగారెడ్డిగూడెం, పచ్ఛిమగోదావరి జిల్లా.
ఈ ముగ్గురు కలిసి ఈ సంవత్సరం జులై నెల నుండి పాల్వంచ మరియు అశ్వారావుపేట పట్టణాల పరిధిలో మొత్తం 05 నేరాలకు పాల్పడ్డారు.వీరి వద్ద నుండి 256.6 గ్రాముల బంగారం,1000 గ్రాముల వెండి మరియు 22,000/-రూపాయల నగదును మొత్తం సుమారుగా 14,00,000/-విలువ గల ఆభరణాలతో పాటు ఒక పల్సర్ బైకును స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం ఈ రోజు కోర్టునకు తరలించడం జరుగుతుంది.
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
Post A Comment: