- \ఉద్యమకారులు గులాబీజెండాకు ఊపిరి
- దెబ్బలు తిని జెండాలు మోసిదే
- పార్టీ కార్యకర్తలే
- ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,
- 146 బౌద్ద నగర్ డివిజన్ ఎన్నిక ఇంచార్జి కుసుమ జగదీష్
మన్యం టీవీ ఏటూరునాగారం:
ఈరోజు పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ బౌద్ద నగర్ డివిజన్ లో 2001 నుండి జెండాను గుండెల్లో పెట్టుకొని మోసిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఇవ్వాలి అని నూతన గా ఇతర పార్టీ ల నుండి వచ్చిన వారు తప్పకుండా ఉద్యమకారులను గౌరవించాలి. అని అన్ని రకాల సమస్యలను నేను అధిష్టానం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్తాను అని ఉద్యమకారుల సమీక్ష సమావేశంలో ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్,146 బౌద్ద నగర్ డివిజన్ ఎన్నికల ఇంచార్జి కుసుమ జగదీష్ అన్నారు.
ఉద్యమ సమయంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని గులాబీ జెండాను మొస్తేనే ఈరోజు అందరూ గులాబీ కండువా వేసుకుంటున్నారు. అని పార్టీ కి పునాదులు ఉద్యమకారులు,కార్యకర్తలు అని స్థానికులు గుర్తించాలి అని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్త డివిజన్ బౌద్ద నగర్లో గులాబీ జెండా ఎగరా వేసి అభివృద్ధి చేసుకోవాలి అని ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు.
అనంతరం
మాతోటి ఉద్యమకారులు కుసుమ జగదీష్ మాయొక్క సమస్యలకు స్పందించిన తీరు భవిష్యత్ కు మార్గం వేసింది.తప్పకుండా బౌద్ద నగర్ లో గులాబీ జెండాను మోసిన మేము గెలిపిస్తాము అని వాగ్దానం చేశారు.
ఈయొక్క కార్యక్రమంలో గులాబీ శ్రేణులు పాల్గొన్నారు.
Post A Comment: