హైదరాబాద్:
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తంలో భాగంగా శనివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు గార్లతో కలిసి సమావేశం కావడం జరిగింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్ల లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా చర్చించడం జరిగింది.
ఒక్కో డివిజన్ కు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఒక్కో ఎమ్మెల్యే ను ఎన్నికల బాద్యులుగా నియమిస్తామని,నేను కూడా ఒక డివిజన్ బాధ్యత తీసుకొని ప్రచారం నిర్వహిస్తామని తెలపడం జరిగింది.
కేసీఆర్ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది.
నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలను కుత్బుల్లాపూర్ డివిజన్ల లో ఏ డివిజన్ కి ఏ ఎమ్మెల్యేను ఎన్నికల బాద్యులుగా నియమించాలో ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.
ప్రస్తుత స్థానిక పరిస్థితులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వివరించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తే బాగుంటుందో వారి అభిప్రాయం తెలిపారు. దీన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్తానని వారితో చెప్పడం జరిగింది.
జిహెచ్ఎంసి లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రతి ఒక్కరు కలిసికట్టుగా,
బాధ్యతాయుతంగా
పనిచేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది.
Post A Comment: