మన్యం టీవి, పినపాక:
ఈనెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ మధుసూదన్రెడ్డి కార్మికులను కోరారు .ఆదివారం బీటీపీ ఏస్ గేటు వద్ద ఐ.ఎఫ్.టి.యు ముద్రించిన సార్వత్రిక సమ్మె పోస్టర్ ను ఆవిష్కరించి అనంతరం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజావ్యతిరేక రైతు వ్యతిరేక విధానాలను అవలంభి స్తూ, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందన్నారు. దానిలో భాగంగానే రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను కార్మిక వ్యతిరేక లేబర్ కోళ్లను ప్రజావ్యతిరేక ప్రైవేటీకరణను తీసుకు వచ్చిందన్నారు ఇలాంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించే వలసిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు అందుకే ఈ నెల 26న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు వి. జానయ్య, క్రిష్ణ, సలీం పాషా, సుధాకర్, బుచ్చి రెడ్డి ,నాగన్న, రహీమ్ పాషా, వహీద్, సిఐటియు నాయకులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: