CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సన్నాలకు 2500 రూపాయలు మద్దతు ధర ఇప్పించాలి (ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ

Share it:


 మన్యం టీవీ వాజేడు.

వాజేడు మండల కేంద్రంలో తుడుం దెబ్బ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు కబ్బాక శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఏజెన్సీ వాసులు అందరూ సన్నరకం వరిని తమకున్న అన్ని భూములలో  ఎక్కువగా పండించారని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరియు  రెగ్యులర్గా వచ్చే రోగాలు వీటన్నిటి వలన రైతులకు పెట్టుబడి ఎక్కువైందని వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని సన్నరకం ధాన్యా నికి ఒక క్వింటాకు 2500 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.ఏజెన్సీ ప్రాంత వాసుల తరపున గోదావరి నది  ఉన్న స్థానికులకు ఉపయోగపడటం లేదనీ స్థానిక మండలాలు అయినా ఏటూరునాగారం, కన్నాయిగూడెం,తాడ్వాయి, మంగపేట,వెంకటాపురం, వాజేడు,గోవిందరావుపేట, ములుగు,వెంకటాపూర్ మండలాల రైతులకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగు త్రాగు నీరు అందించాలన్నారు   వాజేడు మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింత సోమరాజు,కణితి వెంకట కృష్ణ జిల్లా నాయకులు మట్టి రమేష్,తాటి నరసింహారావు ఏటునాగారం మండల అధ్యక్షులు కబ్బాక రామన్న  తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: