మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ బిర్సా ముండా 145వ జయంతి సందర్భంగా మణుగూరు మండల మరియు కూనవారం గ్రామ ప్రజలకు మన్యం టీవీ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆదివాసుల అస్తిత్వం,జీవన స్థితిగతుల కోసం పోరాటం చేసిన గోండు బెబ్బులి,ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా అని అన్నారు. అలాగే ఆ మహనీయుడి అడుగుజాడల్లో పయనించాలని,అతని పోరాటాన్ని స్ఫూర్తి గా తీసుకొని ప్రతి ఒక్కరు జాతి అస్థిత్వం కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా బిర్సా ముండా జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: