CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదిలాబాద్లో డీజీపీ మకాం..క్షేత్రస్థాయిలో పోలీసులకు సూచనలు

Share it:

మన్యం టీవి , ఆదిలాబాద్‌ : డీజీపీ కీలక సమీక్షలు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు మళ్లీ పుంజుకోకుండా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పోలీసులకు సూచనలు ఇచ్చేందుకు డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. గత బుధవారం నుంచి ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఉంటూ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఏరియల్ సర్వే, జిల్లా ఎస్పీలతో సమీక్షలు నిర్వహించిన ఆయయ.. శుక్రవారం రాత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన తిర్యాణీ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి.. మంగీదళం, మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. మరోవైపు ఐజీ నాగిరెడ్డి సైతం నిర్మల్‌ ఏజెన్సీ ప్రాంతంలోని స్టేషన్లను సందర్శించారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో కూడా పోలీసులు హైఅలెర్ట్‌ అయ్యారు. ఈ క్రమంలోనే మావోయిస్టు ప్రభావిత ఆదిలాబాద్‌, కరీనంరగ్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఎస్‌హెచ్‌వోల బదిలీలు చోటుచేసుకోవడం గమనార్హం.బంద్ పిలుపు.. ప్రాజెక్టుల వద్ద సెక్యూరిటీ పెంపు ఈ నెల 3న గుండాల లో చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత హరిభూషణ్‌ గన్‌మన్, యాక్షన్‌ టీం కమిటీ సభ్యుడు దూది దేవాల్‌ అలియాస్‌ శంకర్‌ హతమయ్యాడు. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని లేఖలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. ఆదివారం ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునింది. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (బీటీపీఎస్‌), సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల వద్ద పోలీసులు భద్రత పెంచారు.
Share it:

TELANGANA

Post A Comment: