మన్యం టీవి ,
తెలంగాణ : సీఎం కేసీఆర్ ఇపుడు మరో సంచలనానికి రెడీ అవుతున్నారు. జాతీయ పార్టీ ద్వారా దేశరాజకీయాలను మలుపు తిప్పే అద్భుత వ్యూహాన్ని రచించారు. తెలంగాణను సాధించి పట్టాలెక్కించిన కేసీఆర్ ఇప్పుడు నవ భారతానికి దిక్సూచి కావాలని అనుకుంటున్నారట.. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ పెట్టి దేశాన్ని ఏలే దిశగా కేసీఆర్ యోచిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. పేరు ఇప్పటికే ఖరారైందని.. చురుగ్గా రిజిస్టర్ ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలతో కేసీఆర్ ఇప్పటికే మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ కాంగ్రెస్ లకు ప్రత్యామ్నయంగా కేసీఆర్ ‘జాతీయ’ పార్టీకి పురుడు పోస్తున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలతో దేశం బాగుపడలేదని.. ప్రాంతీయ పార్టీలతో కొత్త పార్టీ దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నట్టు సమాచారం. పార్టీపై న్యాయకోవిదులు నిపుణులతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం.
Navigation
Post A Comment: