మన్యం టీవి ,
చర్ల : రైతులు తమ తమ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యుడు కోరారు. చర్ల మండలంలో ఖరీఫ్ 2020 లో వ్యవసాయ విస్తరణ అధికారులు నమోదు చేసిన పంటల వివరాలు క్రాస్ వెరిఫికేషన్ నిమిత్తం చర్ల మండలంలోని సుబ్బంపేట, కేశపురం, దండు పేట ,తెగడ ,చిన్న మిడిసిలెరు, లింగాల, కొమ్ముగూడెం, పెద్ద పెళ్లి, జి పి పల్లి ఇతర గ్రామాలను సందర్శించి రైతులు వేసిన పంటలను చూసి నమోదు చేసిన పంటల వివరాల్ని పరిశీలించి రైతులకు పంట నమోదు కార్యక్రమం యొక్క ఉపయోగాలు వివరించారు. ఇంకా పంట వివరాలు నమోదు చేసుకుని రైతులు సంబంధిత ఏఈఓ, ఏవో నీ వ్యవసాయ శాఖ వారిని సంప్రదించి పంట వివరాలు తప్పక నమోదు చేసుకోవాలని సూచించారు. ఇలా నమోదు చేసుకున్న రైతుల నుండి మాత్రమే ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి తెలియజేశారు. అనంతర తెగడ పంచాయతీలో నిర్మిస్తున్న రైతులు వేదికను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కె. అభిమన్యుడు,ఏడి నవీన్, ఏవో పి .శివ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: