మన్యం టీవి :
రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) వ్యవస్థను రద్దు చేసినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్, పత్తిపాక గ్రామాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వారు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట పడుతుందన్నారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తూ సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం కృషి చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఇందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడం మంచి నిర్ణయమన్నారు.
Navigation
Post A Comment: