మన్యం టీవి ,మణుగూరు న్యూస్ :తెలంగాణ విప్ రేగా కాంతారావు గారి సూచనల మేరకు మణుగూరు మండలంలోని గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని తోగ్గూడెం ఎంపీటీసీ సభ్యుడు కణితి బాబురావు అన్నారు. సోమవారం మన్యం టివి తో ఆయన మాట్లాడుతూ పంచాయితీలకు కేటాయించిన నిధులను అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నామన్నారు. ఎంపిటిసి పరిధిలోని పంచాయితీలకు సంబందించిన పనులు అనుకున్న సమయంలోనే పూర్తి అవుతున్నాయని పారిశుధ్యం పల్లె ప్రగతివనం హరితహారం రోడ్ల మరమత్తు పనులూ సకాలంలో జరుగుతున్నాయన్నారు. కరోనా రోజురోజుకి విజృంబిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచనలు ఇస్తున్నామన్నారు. కరోనా బారిన పడిన ప్రజలకు పోషకాహారం నిత్యావసర సరుకులు అందజేయ్యడం జరుగుతుందన్నారు. మణుగూరు పంచాయితీల అభివృద్ధికీ తన వంతు కృషి చేస్తాను అని మన్యం టివికి తెలిపారు.
......
Post A Comment: