పినపాక : బురదమయమైన వీధి లో నడవడం నరకంగా మారిందని ఓ వికలాంగ మహిళా తన గోడు వెళ్లబోసుకుంది.వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వాపురం మండలం లోని మిట్టగూడెం గ్రామ పంచాయతీ పరి ధిలోని బోడిక సీతయ్య గుంపు నకు చెందిన ఆదివాసి వికలాంగ మహిళ పోడియం సుజాత ఇంటి ముందు ఉన్న వీధి ఇటీవలే కురిసిన వర్షాలకు పూర్తిగా బురద మయంగా మారింది. దీనితో ఆ వికలాంగ గిరిజన మహిళ తన ఇంటికి వెళ్ళాలి అంటేనే అనునిత్యం నరకయాతన అనుభవిస్తుంది.తక్షణమే తమ వీధిని బాగు చెయ్యాలని పోడియం సుజాత ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంటుంది.
Post A Comment: