హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీష్రావు కరోనాను జయించారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఇక మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు.
Navigation
Post A Comment: