మన్యం టీవి :
- యువత భాగస్వామ్యంతో టీ ఆర్ ఎస్ పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తా
- మన్యం టివి తో మణుగూరు టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రుద్ర వెంకట్
మణుగూరు :
ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత రాష్ట్ర మంత్రివర్యులు కె టి ఆర్,పినపాక నియోజకవర్గ స్ఫూర్తి దాత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆశయాలకు అనుగుణంగా వారు చూపిన మార్గాన పయనిస్తూ మణుగూరు పట్టణం లో యువత భాగస్వామ్యంతో టీ ఆర్ ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ పార్టీ మణుగూరు యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్ మన్యం టివికి తెలిపారు. ఈ సందర్బంగా
ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి తో మణుగూరు మండలం విద్య,వైద్య ఆరోగ్య, ఉపాధి,అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. వీఆర్వో ల వ్యవస్థను రద్దు చేసి నూతన రెవెన్యూ చట్టం ఏర్పాటు చేయడం పట్ల ప్రజలు ,రైతులు హర్షం వ్యక్తం చేసున్నారు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ లో మంచినీటి సమస్య తీర్చడం కోసం
పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని కలిసి మణుగూరు మున్సిపాలిటీ లో ఉన్నటువంటి మంచినీటి అవసరాల రీత్యా ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ సందర్భంగా మన్యం టివి ద్వారా టీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు రుద్ర వెంకట్ ప్రభుత్వవిప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment: