మన్యం టీవి : చర్ల మండలం విజయ కాలనీకి చెందిన చల్లా పెంటయ్య కరోనా వ్యాధి తో గురువారం రాత్రి మరణించడం జరిగింది. ఇతడి మృతదేహానికి దాన సంస్కారాలు చేయడానికి కుటుంబీకులు, గ్రామస్తులు ఎవరు ముందుకు రావడానికి నిరాకరించడంతో విషయం తెలుసుకున్న సర్పంచ్ కాపుల కృష్ణ, ఉప సర్పంచ్ సిరిపురపు శివ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఐదుగురు పారిశుద్ధ కార్మికులు ముందుకెళ్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కరోనా వ్యాధి తో మండలంలో రెండవ మరణం సంభవించింది కావున ప్రజలు కరోనా వ్యాధి సోకకుండా ఎవరికివారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, నల్లూరి మురళి, "మేమున్నాం"కమిటీ సభ్యుడు ఎస్కె షాజహాన్ పాల్గొన్నారు.
Navigation
Post A Comment: