\మన్యం టీవి : ఏటూరునాగారం:ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ని బీరెల్లి-బయ్యారం డబుల్ రోడ్డు కల్వర్టుల వద్ద ఇంజనీరింగ్ ప్రణాళిక ప్రకారం రోడ్డు నిర్మించక పోవడం వల్ల బీరెల్లి బయ్యారం డబుల్ రోడ్డు, అంకంపల్లి వద్ద వేసిన కల్వర్టు రాత్రి కురిసిన వర్షానికి తెగి పోయింది. దీంతో కాటాపూర్ నుండి కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం క్రమంలో అందులో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను వరంగల్ హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం పంపారు. రాక పోకలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గతంలో కురిసిన వర్షాలకు బీరెల్లీ గ్రామం జలదిగ్బంధంలో ఉండి పోయింది. ఇప్పుడు రాత్రి కురిసిన వర్షానికి, అంకంపల్లి వద్ద కల్వర్టు తెగి రాకపోకలు ఆగిపోయాయి. బీరెల్లి బయ్యారం డబుల్ రోడ్డు నిర్మాణానికి కి ఒక ప్లాన్ లేకుండా ఇంజనీరింగ్ ప్లాన్ కాకుండా, ఇష్టారాజ్యంగా నిర్మించిన ఆర్అండ్బి అధికారులపై కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకొని కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలని, ఆర్ అండ్ బి అధికారులను ఉద్యోగం నుండి తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Navigation
Post A Comment: