CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరులో గ్రీన్ ఛాలెంజ్

Share it:

మన్యం టీవి : రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు...భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని రైల్వే స్టేషన్ ఏరియా లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటిన పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం చేపట్టారు.. దీనికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టి సంపన్న వర్గాల ప్రజానీకాన్ని ఏకతాటి మీదకి తీసుకువచ్చి మొక్కలు నాటే కార్యక్రమం ఉద్యమంలా కొనసాగిస్తున్నారు... ఈ మహా ఉద్యమంలో నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ సిరికొండ శ్యాంసుందర్, టిఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సకిని బాబురావు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు పద్ధంశ్రీనివాస్, బోశెట్టి రవి ప్రసాద్,యాంపాటి సందీప్ రెడ్డి, గుర్రం సృజన్, మారోజు రమేష్,రాజు, శివ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
Share it:

TELANGANA

Post A Comment: