వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్బర్గ్ వివరించారు.
ఫేస్బుక్, గూగుల్ కంపెనీలకు షాకిచ్చిన ఆస్ర్టేలియా
వార్తా కథనాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా మీడియాకు చెల్లించాలని ప్రముఖ డిజిటల్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్ సంస్థలను ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలను జరపాలను ఆర్థిక శాఖ మంత్రి జోష్ ఫ్రైడెన్బర్గ్ శుక్రవారం పేర్కొన్నారు. లేదంటే కోడ్ ఉల్లంఘించిన కారణంగా సదరు కంపెనీలపై దాదాపు 7 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టు 28 వరకు సంప్రదింపులు జరిపి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని సూచించారు. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించి చట్టం అమల్లోకి తెస్తామని జోష్ ఫ్రైడెన్బర్గ్ వివరించారు.
Post A Comment: