ములకలపల్లి:మన్యం న్యూస్:(అక్టోబర్01) అక్టోంబర్ 8,9 తేదీలలో ప్రగతి శీల మహిళా సంఘం 7 వ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయలని మండలం లోని,ముత్యాలంపాడు గ్రామంలో POW మండల కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్,కరపత్రం ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రగతి శీల మహిళా సంఘం(pow) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు కల్లూరి పద్మ మాట్లాడుతూ,మహిళలు నేటికీ ఏమాత్రం విలువా,గౌరవం, గుర్తింపూ లేని ఇంటి చాకిరీలో,పిల్లలు పెంపకంలో అత్యధిక సమయాన్ని వెచ్చిస్తున్నారని,ఈ పనులు కుటుంబ సభ్యులు ఉమ్మడి బాధ్యతలుగా కాకుండా స్త్రీల పనులుగా చూస్తున్నారని,ఉద్యోగాలు , శ్రమలు చేస్తున్న మహిళలు కూడా తప్పనిసరిగా చేసి తీరాల్సిన పనులుగా ఇంటి పనులు భావించబడున్నాయి.ఫలితంగా స్త్రీ మానసిక పరిది సంకుచిత మవుతున్నదని అన్నారు. ఇటివంటి మానసిక పరిస్థితి ని పాలకవర్గాలు ఉత్పన్నమవుతుందని. ఇటువంటి వివక్షతకు వ్యతిరేకంగా, స్త్రీ, పురుష సమానత్వాన్ని కోరుతూ ప్రగతి శీల మహిళా సంఘం(POW) రాష్ట్ర 7 వ మహాసభలను నారాయణపేట లో అక్టోబర్ 7,8 జరుగుతుందని ఈ సభల విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో POW జిల్లా కమిటీ సభ్యురాలు,ఎంపిటీసి మడకం విజయ,ఈసం లతా, ఈసం వెంకట లక్ష్మి, వెంకటరమణ,వెంకటమ్మ, కవితా, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: