మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ "బిల్ట్"కంపెనీ కాలనీలోని రేఖా గ్రౌండ్లో ఆదివారం మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగపేట మండల స్థాయిలో మంగపేట యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ నాలుగు రోజులపాటు జరగనున్నాయి.
ఈ టోర్నమెంట్లో మంగపేట మండలం లోని అన్ని గ్రామాల క్రీడాకారుల జట్లు పాల్గొంటున్నాయి.
మొత్తం 20 టీములు పోటీలో పాల్గొoటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కాగా రోజుకు మూడు మ్యాచ్లు నిర్వహిస్తున్నట్టు టోర్నమెంట్ మేనేజ్మెంట్ తెలిపింది.మొదటి బహుమతి రూ,10016 కాగా, రెండో బహుమతి రూ, 5016 లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
ఈ టోర్నీ కి స్పాన్సర్లు మంగపేట సింగిల్ విండో చైర్మన్ తోట రమేష్,డైరెక్టర్లు నర్రా శ్రీధర్, సిద్ధం శెట్టి లక్ష్మణరావు, షేక్ అబ్దుల్, హాబీబ్ మెడికల్ షాప్ యజమాని గఫార్ ఖాన్, మంగపేట టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బుట్టో లు ఉన్నారు.ఈ టోర్నమెంట్ కి సహకరించిన ప్రజాప్రతినిధులు,పోలీసు వారికి టోర్నమెంట్ మేనేజ్మెంట్ కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ సభ్యులు అన్వేష్ ,షణ్ముఖ్ వెంకట సాయి, సాయి,ఖాలీద్, చల్లా రాంకీ, జక్కం నాగేశ్వరరావు సుంకోజు ప్రశాంత్ పల్లాపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: